Header Banner

ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆపరేషన్ వైసీపీ! నెక్స్ట్ వికెట్..!

  Tue May 20, 2025 17:44        Politics

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం పూర్తవుతోంది. అటు టీడీపీ మహానాడు వేడుకకు సిద్దం అవుతోంది. ఈ సమయంలో నే సీఎం చంద్రబాబు మూడు రోజుల ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ సారి పర్యటన అధికారికంగా - రాజకీయంగా కీలకంగా మారుతోంది. వైసీపీ పైన గురి పెట్టిన కూటమి నేతలు.. ఇప్పుడు కొత్త వ్యూహా లు అమలు చేస్తున్నాయి. ఈ నెలాఖరులో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకొనే ఛాన్స్ ఉంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు 22వ తేదీ ఢిల్లీకి వెళ్లనున్నారు. 23వ తేదీ కేంద్ర మంత్రులతో సిఎం సమావేశాలు ఖరారయ్యాయి. ఆర్దిక, ఇరిగేషన్, హోం, జాతీయ రహదారుల శాఖల మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆ మరుసటి రోజు 24వ తేదీ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొననున్న చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తావన చేయను న్నారు. ఇప్పటికే నీతి అయోగ్ సభ్యులకు ఏపీలో తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. అదే విధంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈ గవర్నెర్స్ గురించి ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ పర్యటనలో రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

పార్టీ మహానాడు సమయంలో కడపతో పాటుగా ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ ముఖ్యులు టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని పార్టీ నేతల సమాచారం. కాగా, ఒక రాజ్యసభ సభ్యుడు సైతం కూటమి పార్టీలతో టచ్ లోకి వెళ్లినట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఆ సభ్యుడు తనకు తిరిగి టీడీపీ నుంచి పెద్దల సభకు అవకాశం ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నానంటూ సంకేతాలు ఇస్తున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటుగా.. లిక్కర్ కేసు విచారణ.. జగన్ ప్రమేయం పైన ఇప్పటి వరకు లభించిన ఆధారాల గురించి వివరించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక, మహానాడు తరువాత ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని ప్రచారం సాగుతున్న వేళ చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది.

ఇది కూడా చదవండి: ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ఇకపై నో టెన్షన్..! విమానాల తరహాలో బస్సుల్లో కూడా..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapraasi #delhi #Apcm #CBN #beti #keydecisions